తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర సందడి.. న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం

ఆదివారం, 1 జనవరి 2023 (09:04 IST)
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2023 కొత్త సంవత్సరానికి మిరుమిట్లు గొలిపే వేడుకలతో స్వాగతం పలికారు. అదేసమయంలో 2022 సంవత్సరానికి బైబై చెప్పారు. కొత్త సంవత్సర వేడుకలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఘనంగా జరిగాయి. 
 
విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఆయా ప్రాంతాల వాసులు అర్థరాత్రి ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేక్‌ కట్‌ వేడుకలు, కమ్యూనిటీ కార్యక్రమాలు, రంగురంగుల రంగోలీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
 
మరోవైపు కొత్త సంవత్సరం రోజు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు, కొత్త సంవత్సర వేడుకల ఫోటోలు మరియు వీడియోలతో ఇంటర్నెట్ సందడి చేస్తోంది.
 
మరోవైపు, అనేక ప్రపంచ దేశాలు 2023 సంత్సరానికి స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణాసంచా వెలుగులతో నిండిపోయింది.
 
కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగులు బాణాసంచా ఆకాశంలో అద్భుతమైన వర్ణచిత్రాన్ని ఆవిష్కరించింది. లేజర్ లైటింగ్, విద్యుద్దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో సిడ్నీ హార్బర్, ఐకానికి ఓపెర్ హౌస్, సిడ్నీ బ్రిడ్జి కనువిందు చేశాయి. 
 
అలాగే, హార్బర్ వంతెనపై 7 వేల రకలా బాణాసంచా కాల్చారు. ఓపెరా హౌస్ వద్ద 2 వేల రకాల బాణా సంచా కాల్చారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఇక్కడ బాణాసంచా విన్యాసాలు చేపట్టలేదు. ఓ వైపు లైవ్ మ్యూజిక్ వినిపిస్తుండగా సిడ్నీ వాసులు న్యూ ఇయర సంబరాలు జరుపుకున్నారు. అలాగే మెల్‌‍బోర్న్ నగర వాసులు కూడా కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు