కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

ఠాగూర్

ఆదివారం, 22 జూన్ 2025 (19:41 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
 
సింగయ్యను ఢీకొట్టిన కారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారని వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి, పరిశీలించారు. అలాగే, ప్రత్యక్ష సాక్షుల నుంచి వీడియోలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం ఒకటి లభించింది. 
 
జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో జగన్ కారు పైనుంచి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదేసమయంలో మరో ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోతుండటం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా.. వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. 
 
ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై, ముఖ్యంగా, జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై జగన్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. 


ఒక నేత ర్యాలీకి వెళ్లి… ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు.

ప్రజల ప్రాణాలకంటే ఏ నాయకుడి ప్రచారం గొప్పది కాదు.

ఈ విషాద ఘటనలపై ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, “ఇది సంఘటన మాత్రమే” అని వ్యవహరించటం అత్యంత దుర్మార్గం.

ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా ఆగాలి.… pic.twitter.com/LvjDAJTY9f

— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) June 22, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు