ఏపీలో థియేటర్లకు అనుమతి, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ఇవే

సోమవారం, 5 అక్టోబరు 2020 (15:37 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబరు 15 నుంచి థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఎంటెర్టైన్మెంట్ పార్కులకు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్ లోనికి అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వాలని వెల్లడించింది.
 
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలలు తర్వాత ఏపీలో మళ్లీ థియేటర్లు తెరుచుకోనున్నాయి. అటు కేంద్రం ఇప్పటికే థియేటర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా ఉత్తర్వులో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు