సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుపతికి బయలుదేరింది. ఈ రైలు, కావలి స్టేషన్ దాటిన తర్వాత వేంకటేశ్వర పాలెం సమీపంలోని రాగానే గుర్తు తెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు
నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో నుంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. వారివద్ద ఉన్న రూ.20 వేల నగదు, మొబైల్ ఫోన్ కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.