ఏపీలో మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:53 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:30 గంటల నుంచే ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవిన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,639 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిపికేషన్‌ వెలువడగా.. ఇప్పటికే ఇందులో 579 పంచాయతీలు, 11,753 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు