ప్ర‌యివేటు యాజ‌మాన్యం చేతిలోకి తిరుప‌తి విమానాశ్ర‌యం...

శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:25 IST)
కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అన్నీ ప్ర‌యివేటు ప‌రం చేయ‌డంలో ఆరితేరిపోతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కీల‌కం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుండ‌గా, ఇపుడు తిరుప‌తి ఎయిర్ పోర్ట్ ని ప్ర‌యివేటు యాజ‌మాన్యానికి అప్ప‌గించాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభం అయ్యాయి. 
 
తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్‌ చేతికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతితోపాటు భువనేశ్వర్‌, వారణాసి, అమఅత్‌సర్‌, తిరుచ్చి, ఇండోర్‌, రారుపూర్‌, గయ, కుశీనగర్‌, కాంగ్రా వంటి 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేటు రంగానికి అప్పగించబోతున్నారు. జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) కింద ప్రభుత్వం వీటి నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించబోతోంది. 
 
భారతీయ విమానాశ్రయాల ప్రాధికారిక సంస్థ (ఎఎఐ) డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ చర్య ద్వారా 2024 మార్చినాటికి చిన్న ఎయిర్‌పోర్టుల్లోకి రూ.3,660 కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. జిఎంఆర్‌, అదానీ వంటి పెద్ద సంస్థలకు బదులు మౌలిక సదుపాయల రంగంలో ఉన్న స్థానిక సంస్థలు ఈ చిన్న విమానాశ్రయాల నిర్వహణకు ముందుకు వస్తాయని భావిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు