అలాంటి వాళ్లు తిరుమలకు రావొద్దు : తితిదే అధికారులు

బుధవారం, 10 ఆగస్టు 2022 (10:31 IST)
రద్దీ రోజుల్లో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు తిరుమల కొండపైకి రావొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్త చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ కారణంగా భక్తులు భారీగా తరలివస్తారని, దీంతో తిరుమలో రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ప్రణాళికాబద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే అధికారులు కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు