అన్నమయ్య జిల్లాలో ఇద్దరు చిన్నారులను మింగేసిన చెరువు

మంగళవారం, 21 జూన్ 2022 (13:36 IST)
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్ (9), కార్తీక్ (8) అనే ఇద్దరు చిన్నారులు గ్రామంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిద్దరూ తమ దస్తులను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఈత కొట్టేందుకు గట్టుపై నుంచి నీటిలో దూకారు. అంతే.. వారిద్దరూ వెళ్లి చెరువు ఊబిలో చిక్కుకునిపోయారు. 
 
అయితే, ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్ళిన పిల్లలు చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు. చెరువు గట్టు వద్ద పిల్లల దుస్తులు కనిపించడంతో నీటిలో గాలించారు. ఈ గాలింపు చర్యల్లో ప్రవీణ్ మృతదేహం లభ్యంకాగా, కార్తీక్‌ను ఆస్పత్రికి తరలించే మార్గంలోనే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు