కడపలో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుమార్తెను వేధిసున్నాడనే ఆగ్రహంతో అల్లుడిని మామ పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కడన ఆర్కే నగర్కు చెందిన చాంద్ బాషాకు, అశోక్నగర్లో నివాసముంటున్న మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
20 రోజుల క్రితం కువైట్ నుండి వచ్చిన ఆయేషా తండ్రి మహబూబ్ బాషా అల్లుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని కిడ్నాప్ చేసి చంపేశాడు. హత్య అనంతరం మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్నచౌకు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.