వాస్తవానికి వైయస్కు కూడా ఉండవల్లి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బంధాన్ని కొనసాగిస్తూ జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఉండవల్లి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వైసీపీ ఆఫీస్లో ఉండవల్లి ప్రెస్మీట్ పెట్టే తరుణం తొందర్లోనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.