కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి నిధుల వరద పారించారు. ఆ తర్వాత ఏపీకి గుడ్డిలో మెల్లగా అన్నట్టుగా కొంతమేరకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా, ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో రూ.5936 కోట్లను ఆమె కేటాయించారు. అలాగే, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూడా ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఏపీకి కేటాయించిన కేటాయింపులను పరిశీలిస్తే,
ఏపీకి కేటాయింపులు ఇవే :
పోలవరం ప్రాజెక్టుకు - రూ.5,936 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ.12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్కు - రూ.3,295 కోట్లు
విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు - రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు - రూ.375 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ.162 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు.