దేవాల‌యాల ప్ర‌క్షాళ‌ణే ల‌క్ష్యం : దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (15:24 IST)
దొంగాల‌ను దాచే సంస్కృతి  తెలుగుదేశం ప్ర‌భుత్వానిది  అని, అవినీతికి తావులేకుండా పార‌ద‌ర్శ‌క పాల‌న జ‌గ‌నన్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు... ఆల‌యాల ప్ర‌క్షాళ‌ణ దిశ‌గా వైసీపీ  ప్ర‌భుత్వ పాల‌న సాగుతుంద‌న్నారు.. 
 
నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 45వ డివిజను అభ్య‌ర్థి బండిపాటి సంధ్య‌రాణి ఎన్నిక‌ల ప్ర‌చారంలో  మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పాల్గొన్ని సితార సెంట‌ర్ నుంచి క‌బేలా రోడ్డులో రాము క్వారీ త‌దిత‌ర ప్రాంతాల‌ను   ప‌ర్య‌టించారు..
 
ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఉద్య‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టడం జ‌రిగింద‌ని, ద్వార‌క తిరుమ‌ల‌, విశాఖ‌, గుంటూరు జిల్లా దేవాల‌యాల ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం గుర్తు చేశారు.. అదే విధంగా నేడు దుర్గ‌మ్మ ఆల‌యంలో కూడా ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివరించారు... దీనిని కూడా  కొంద‌రు రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నార‌ని అన్నారు.. ఆల‌యాల్లో రాజ‌కీయ‌ల‌కు, అవినీతికి తావులేద‌న్నారు.. పార‌ద‌ర్శ‌క పాల‌నే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు