తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభం

సోమవారం, 25 జులై 2016 (12:44 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల్లూరులోని రైల్వేస్టేషన్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా వైఫై సేవలను కేంద్రమంత్రులు సురేష్‌ ప్రభు, వెంకయ్యనాయుడులు ప్రారంభించారు. ఎప్పటి నుంచో తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలను ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది.
 
ఏపీ నుంచి రాజ్యసభకు కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభు ఎన్నిక కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్లకు మహర్ధశ వచ్చింది. తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అన్నారు. ప్రయాణీకులకు వైఫైసేవలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి