భార్యతో యువకుడు రాసలీలలు, చూడగానే గోడ దూకేసాడు, భార్య తలను గోడకేసి కొట్టేశాడు

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:18 IST)
నెల్లూరు జిల్లా మైపాడు గేటు ప్రాంతమది. రవి, ఈశ్వరమ్మలకు సంవత్సరం క్రితమే వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. రవి మేస్త్రీ పని చేసేవాడు. ఈశ్వరమ్మ ఇంటి పట్టునే ఉండేది. రవికి అనుమానం ఎక్కువ. తను పనికి వెళ్ళినప్పుడు భార్య ఎవరెవరితోనే కలుస్తోందని అనుమానం రవికి.
 
రెండునెలల నుంచి భార్యలో మార్పు కనిపించింది. తట్టుకోలేపోయాడు. అనుమానం మరింత పెంచుకున్నాడు. తను పనికి వెళ్ళిన సమయంలోనే తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని నిర్థారించుకున్నాడు. స్నేహితుల సహాయంతో భార్యను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవాలనుకున్నాడు.
 
తను పనికి వెళ్ళినా తన స్నేహితులను మాత్రం ఇంటి దగ్గర చూస్తూ ఉండమని చెప్పాడు. సరిగ్గా నిన్న రాత్రి గుర్తు తెలియని ఒక యువకుడు ఇంటిలోకి వెళ్ళాడు. స్నేహితులు రవికి సమాచారమిచ్చారు. నేరుగా ఇంటికి వచ్చిన రవి షాకయ్యాడు. తన భార్య వేరొక యువకుడితో సరస సల్లాపాల్లో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
 
రవిని చూసిన ఆ యువకుడు గోడ దూకి పారిపోయాడు. దాంతో రవి తన భార్యను మాత్రం చిత్రహింసలు పెట్టాడు. ఆమె తలను గోడకేసి దబాదబా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు నిందితుడే తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు