అయితే వీరిద్దరి కులాలు వేరుకావడంతో శివకుమార్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే జ్యోతి తల్లి చనిపోవడంతో తండ్రి ఓదెలు ఆమెను పెంచాడు. అయితే బంధువులు, గ్రామస్థుల సాయంతో జ్యోతిని వేరే వ్యక్తికి ఓదెలు పెళ్ళి చేశాడు. జ్యోతికి వివాహమైన తర్వాత కూడా జ్యోతిని శివకుమార్ తరచూ రమ్మని ఫోన్ చేసేవాడు. దీంతో భర్తతో కాపురం చేయలేక ప్రియుడి కోసం సిద్ధం పేటకు చేరుకుంది జ్యోతి. అయితే ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో శివకుమార్తో జీవిస్తానని జ్యోతి తేల్చి చెప్పేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.