గత పదిరోజుల క్రితం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మహిళా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది సిద్దేశ్వరమ్మ. అయితే మంగళవారం రాత్రి కూడా శివకుమార్ కట్నం కోసం వేధించడంతో మనస్థాపానికి గురైన సిద్ధేశ్వరమ్మ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.