ఇంకా ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణకు వచ్చే వ్యాపారవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. వారి రాకను తమకు తెలియజేస్తే ప్రభుత్వ తరపు అధికారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధంగా వేచి ఉంటారన్నారు. వారు రాగానే ముఖాముఖి మాట్లాడేసి 15 రోజుల్లో కంపెనీని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తామన్నారు. ఈ వ్యవహారాన్నంతా తానే స్వయంగా చేస్తానని కూడా చెప్పారు.