తెలుగు భాష గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ?

మంగళవారం, 13 జులై 2021 (11:16 IST)
తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేద‌ని, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్టాడుతూ, తెలుగు గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ అని ఎద్దేవా చేశారు.

తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే ,వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్న‌పుడు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ వైసీపీ ప్ర‌భుత్వం రాగానే, సీఎం జ‌గ‌న్ పంచ‌న చేరారు. ఆయ‌న‌ను భాషా సంఘం అధ్య‌క్ష ప‌దవి నుంచి తొల‌గిస్తార‌నే, ఊహాగానాలు కూడా అప్ప‌ట్లో వెలువ‌డ్డాయి.

కానీ, వైసీసీ అండ‌దండ‌ల‌తో యార్ల‌గ‌డ్డ కొన‌సాగుతూ వ‌చ్చారు. ఇపుడు తాజాగా ఇంగ్లిష్ మీడియం, తెలుగు, సంస్కృత అకాడ‌మీల అంశం తెర‌పైకి రావ‌డంతో... వైసీపీ త‌ర‌ఫున చంద్ర‌బాబు కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి తొలిసారి యార్ల‌గ‌డ్డ మీడియా ముందుకు వ‌చ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు