మా నాన్నను పదవి నుంచి పీకేయ్యండి... దువ్వాడు శ్రీనివాస్ కుమార్తె (Video)

ఠాగూర్

సోమవారం, 12 ఆగస్టు 2024 (14:02 IST)
మా నాన్నను పదవి నుంచి పీకెయ్యండి అంటూ వైకాపా ఎమ్మెల్సీ కుమార్తె దువ్వాడ హైందవి కోరారు. ఈ మేరకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు. వైకాపా ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్... మాధురితో శారీరక సంబంధం పెట్టుకుని కుటుంబ సభ్యులను దూరంగా ఉంచిన విషయం తెల్సిందే. దీంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో వారిపై దాడి చేసేందుకు దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారు. 
 
ఈ నేపథ్యంలో తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ గురించి ఆయన పెద్ద కుమార్తె దువ్వాడం హైందవి మీడియాతో మాట్లాడుతూ, మా నాన్న మాపైనే దాడికి ప్రయత్నించాడు. కొట్టేందుకు వచ్చాడు. కాలితో తన్నాడు. పరుష పదజాలంతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని జగన్మోహన్ రెడ్డి కూడా చూసివుంటారు. ఇలాంటి వ్యక్తిని ఇంకా పార్టీలో కొనసాగించడం సిగ్గుచేటు. అందువల్ల ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు. 
 
పైగా, తామంతా ఇక్కడే ఆందోళన చేస్తామన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మాకు తండ్రి అని, ఆయన ఉండే ఇల్లుపై తమకు సర్వ హక్కులు ఉన్నాయన్నారు. మాధురి ఎవరో తమకు తెలియదన్నారు. అయితే, ఎంతకాలం ఆందోళన చేస్తారన్నదానిపై ఆమె స్పందిస్తూ, తాము ఎక్కడికి వెళ్లబోమన్నారు. ఇక్కడే ఉంటామని, ఇది మా ఇల్లు అని చెప్పారు. 


 

మా నాన్నను పదవి నుంచి పీకేయ్యండి.....

- దువ్వాడ కూతురు

విన్నావా @ysjagan వాడి సొంత కూతురే పార్టీ నుంచి పీకేయండి అని మాట్లాడుతుంటే నువ్వు వాడిని ఇంకా పార్టీలో పెట్టుకొని ఊడిగం చేస్తున్నావు సిగ్గు లేకుండా pic.twitter.com/yxja2rksLW

— MC RAJ????️ (@BeingMcking_) August 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు