పోలవరం అప్పుడు అర్థం కాలేదన్నారు, ఇప్పుడెలా అర్థమైంది రాంబాబూ? నెటిజన్ల ట్రోల్స్ (video)

ఐవీఆర్

శనివారం, 29 జూన్ 2024 (12:56 IST)
పోలవరం ప్రాజెక్టు గురించి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, దీనితో భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ సందర్భంగా గత ఐదేళ్లుగా అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనలతో పాటు మాజీమంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను ప్రదర్శించారు. ఆ వీడియోలను చూపిస్తూ సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. పోలవరం ప్రాజెక్టు వీరికి హాస్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
 

pic.twitter.com/1LAgZyaaHf

— Chandrakanth Kanumetta (@chandra_9_0) June 28, 2024
దీనిపై మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాపర్ డయాఫ్రమ్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమనీ, ఓ వీడియోను చూపిస్తూ వివరించారు. రాంబాబు పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. మీరు అధికారంలో వున్నప్పుడు అర్థం కాదు.. పోయాక అర్థమవుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు