రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

ఠాగూర్

మంగళవారం, 3 జూన్ 2025 (14:56 IST)
గుంటూరు జిల్లా తెనాలి రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దళిత, ప్రజా సంఘాల నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఐతా నగర్‌లోని రౌడీ షీచటర్లను పరామర్శించడానికి రావడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్లబెలూన్లతో దళిత సంఘాల నేతలు తమ నిరసన తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. 
 
తెనాలిలో సామన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన రౌడీ ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై సర్వత్రా విస్మయంతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.  జగన్‌కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. 
 
కాగా, తెనాలిలో దళిత, మైనారిటీల వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసుల ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాల తెనాలిలో పర్యటించడం రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
కాగా, గత ఏప్రిల్ 25వ తేదీన తెనాలిలో జాన్ విక్టర్, కరీము్ల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంతదారుణంగా వ్యవహరించిన వి,యం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు