యాధృచ్చికంగా జగన్‌కు కలిసొచ్చిన గురువారం.. ఎలా?

గురువారం, 30 మే 2019 (08:29 IST)
సాధారణంగా కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలన్నా.. కొత్త ఉద్యోగంలో చేరాలన్నా మంచి రోజు, ముహూర్తాలను చూస్తుంటాం. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఓ సెంటిమెంట్ అనుకోకుండా కలిసివచ్చింది. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నార. మే 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ఆయనకు సీఎంగా ప్రమాణం చేస్తారు. 
 
అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇలా అన్నీ కూడా యాధృచ్ఛికంగా గురువారమే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన గురువారం జరిగింది. మే 23న తేదీ గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మే 30వ తేదీ గురువారం జగన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం కలిసొచ్చిందంటూ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారం, వర్జ్యం గురించి తెలిసిన వారు గురువారం గురించి గొప్పగా చెబుతున్నారు. 
 
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్సార్‌సీపీ సాధించిన ఎమ్మెల్యేల స్థానాలు 151ని ఎటు నుంచి చూసినా (వెనుక నుంచి ముందుకు 151, ముందు నుంచి 151 అంకెలు వస్తాయి) ఒకేలా రావడం విశేషం. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రాజకీయ పార్టీగా ఒంటరిగా పోటీచేసి ఏకంగా 86 శాతం (అత్యధిక) ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ సాధించడం మరో రికార్డు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు