బాబుగారి కుప్పం కోట బద్ధలైంది : వైకాపా ఎంపీ విజయసాయి

బుధవారం, 17 నవంబరు 2021 (14:58 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటగా భావించే కుప్పం కోట బద్ధలైందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. కుప్పం మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును బుధవారం చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ 15 స్థానాలు గెలుచుకుంది. దాంతో చైర్ పర్సన్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కుప్పం కోట బద్దలు అయ్యిందని ఆయన అన్నారు. 
 
ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబును రాష్ట్రమంతటితోపాటు ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలు కూడా నమ్మలేదని దీంతో అర్థమైపోయిందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

 

టీడీపీ కుప్పం కోట బద్ధలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ రికార్డు విజయం సాధించింది. చంద్రబాబును రాష్ట్రమంతటితోపాటు ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలు కూడా నమ్మలేదని దీంతో అర్థమైపోయింది.

— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు