వేసవి కాలం వచ్చేసింది. రాష్ట్రంలో ఎండలు జోరందుకున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని సంగతి సరే సరి. విపరీతమైన వేసవి వేడిమి నుంచి ఉపశమనంకోసంమంటూ చాలామంది ఊటీకో.... కోడైకెనాల్కో వెళతారు. కానీ ఆ అవసరం లేకుండా -5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో మంచు కొండల్లో ఉన్న అనుభవాన్ని మనముందుకు తెచ్చింది స్నో వరల్డ్.
ఇది ఎక్కడ ఉన్నదని ఆలోచిస్తున్నారా...? మన రాష్ట్రరాజధాని హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్కు సమీపంలో ఉన్నది. ప్రచండ భానుడి కిరణాల నుంచి కూల్ కూల్గా మంచులోకంలో విహరించాలనుకున్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం ఈ స్నో వరల్డ్. ఈ వీడియో చూడండి....