తెలుపు పంచదారలో మంచిదా..? తాటిబెల్లం మంచిదా..?

బుధవారం, 26 మే 2021 (21:58 IST)
sugar
పంచదార రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే ఆరోగ్యం చెడిపోతుందనేది తెలిసిందే. రకరకాల పద్ధతుల్లో శుద్ధి చేయడం ద్వారా లభించే తెల్లని చక్కెరకు మనం ఇప్పుడు బాగా అలవాటు పడిపోయాం. అయితే మనం ఏరకం చక్కెర తింటున్నాం అనేదాన్ని బట్టి శరీరంపై ప్రభావం ఉంటుంది. చక్కెర, బెల్లం, తాటిబెల్లం, కొబ్బరి చక్కెర, కార్న సిరప్ ఇవన్నీ కూడా మొక్కల నుంచి తీసినవే. కాకపోతే శుద్ధి చేసి వేరుపరచినవి. 
 
ఇలాంటి చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు సంక్రమిస్తాయి. చక్కెరల వల్ల క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశాలుంటాయి. శుద్ధి చేసిన చక్కెరల కంటే పండ్లు, పాల నుంచి పొందే చక్కెర శరీరానికి చాలా మంచిది. 
 
పండ్లలో స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీలలో చక్కెర చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అరటి, మామిడి పండ్లలో, డ్రైఫ్రూట్స్‌లో చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటుంది. పళ్ల రసాల్లో చక్కెర అధికంగా ఉంటుంది. కనుక రసాల కన్నా పూర్తిగా పండును తినేయడమే ఉత్తమం. 
 
తెల్లచక్కెరను దేనిలో కలుపుకుని తిన్నా కడుపు నిండుగా అనిపించదు. ఎన్ని కేలరీలు లోపలికి వెళ్లినా ఏమీ తెలియదు. అలా తింటూనే ఉంటాం. అదే సమస్య. ఊబకాయం వచ్చేది అందుకే. పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లోని చక్కెర మంచిదే. తెల్ల చక్కెర మాత్రం ఎంత దూరం పెడితే అంత మంచిదని పోషకాహార నిపుణుల మాట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు