వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలంటే.. ప్రతిరోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్లో వట్టి పండ్లను తీసుకోండి. మధ్యాహ్న భోజనంలో పండ్లు, పప్పు కూరలు ఉండేలా చూసుకోండి. రాత్రిపూట ఆహారం 8 గంటల్లోపే పూర్తి చేయండి. రాత్రి డిన్నర్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లితో తయారు చేసిన చట్నీలు కానీ.. పొడులు కానీ ఉండేలా చూసుకోండి.
పిల్లలకు ఫాస్ట్ ఫుడ్లను అలవాటు చేయకుండా రోజుకు 3-4 లీటర్ల నీరు తాగేలా అలవాటు చేయండి. జీలకర్రతో మరిగించిన నీటిని వడగట్టి తీసుకోవడం ఉత్తమం. అధికంగా కారం, మసాలా, పులుపు చేర్చిన ఆహారాలను తీసుకోకూడదని, గోధుమలతో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.