* ఇంకా పాదాల్లోని పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఆముదం ఒక స్పూన్, పనీర్ రెండు స్పూన్లు, నిమ్మరసం ఒక స్పూన్.. మూడింటిని ఓ బౌల్లో కలుపుకోవాలి. వేడినీటిలో పది నిమిషాల పాటు పాదాలను నానబెట్టి.. ఆపై పగుళ్లకు నూనె మిశ్రమాన్ని పూతలా రాసుకుంటే పగుళ్లు దూరమవుతాయి.
* ఉప్పు, షాంపూ, నిమ్మరసం కలిపిన వేడినీటిలో కాళ్లను నానబెట్టి ఆపై నునుపు రాతితో పాదాలను శుభ్రం చేసుకున్నట్లైతే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.