అలాగే నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు, తేనె కలిపి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల చలికాలం చర్మం పగలడం, పొడిబారడం వంటివి తగ్గుతుంది. వర్షాకాలానికి ఈ పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇకపోతే.. ఒక కప్పు బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్లు పైనాపిల్ జ్యూస్, ఒక్కో టీస్పూను చొప్పున గ్లిజరిన్, పాలపొడి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసి ఇరవైనిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.