మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర-సిలిండర్‌పై రూ.21లు పెంపు

శనివారం, 2 డిశెంబరు 2023 (12:11 IST)
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో గురువారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. శుక్రవారం, డిసెంబర్‌ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచేసాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. పెరిగిన ధర డిసెంబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. 
 
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మరో 21 రూపాయలు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. హైదరాబాద్‌లో 2024 రూపాయలుగా ఉంది. 
 
కాగా గృహవినియోగ సిలిండర్‌ ధర పెంచకపోవడంతో కాస్త ఉపశమనం లభించినట్టే. ప్రస్తుతం ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు