మహిళా ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఖాతాల ఆదాయం- 3 రెట్లు పెంపు

సెల్వి

సోమవారం, 11 మార్చి 2024 (15:57 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2019 నుంచి 2024 మధ్యకాలంలో మహిళా స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల ఖాతాల ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 
 
పట్టణ మహిళా ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఖాతాలలో గరిష్టంగా 4.6 రెట్లు ఆదాయం పెరిగింది. అలాగే, గరిష్ట ఆదాయం పెరుగుదల 27 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారిలో (4.7 రెట్లు) కనిపించింది. ఎస్‌హెచ్‌జీల సమిష్టి గణాంకాలు 8.5 మిలియన్లు బలంగా వుండగా, 9.21 కోట్ల మంది సభ్యులను కలిగి ఉంది.
 
బ్యాంకుల ఎస్‌హెచ్‌జి పోర్ట్‌ఫోలియో ఇప్పుడు రూ. 2 ట్రిలియన్ల దిశగా దూసుకుపోతోంది. క్రెడిట్ లింకేజీ, డిజిటల్ యాక్సెస్, లక్ష్య విధాన చర్యలు, వ్యవస్థాపక స్ఫూర్తితో పాటుగా, మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యుల ఖాతాలు ఎఫ్‌వై19-ఎఫ్‌పై24 (ఖాతాలలో క్రెడిట్‌లు) సమయంలో ఆదాయం మూడు రెట్లు పెరిగేలా చూసింది. 
 
మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యులలో ఎక్కువ మంది 35 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 43 సంవత్సరాల వయస్సు గలవారేనని అధ్యయనంలో వెల్లడి అయ్యింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు