దేశంలో భారీ తగ్గిన బంగారం ధరలు.. కారణం ఏంటి?

మంగళవారం, 3 మే 2022 (12:22 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారి భారీగా తగ్గిపోయాయి. రంజాన్ పండుగతో పాటు అక్షయ తృతీయ శుభముహూర్తన బంగారం ధరలు భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 
 
బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలను పరిశీలిస్తే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,190 తగ్గి రూ.4,720గా వుది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,280 తగ్గి తులం ధర రూ.51,510కి పడిపోయింది. ఇక వెండి ధర రూ.500 తగ్గి ఒక కేజీ ధర రూ.62,700గా ఉంది. 
 
మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,190 తగ్గి 10 గ్రాముల ధర రూ.47,200గా వుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,280 మేరకు తగ్గి తుల రూ.5,1510గా ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర ఏకంగా రూ.2 వేలు తగ్గి ఒక కేజీ ధర రూ.67,600గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు