పసిడి రేట్లలో హెచ్చుతగ్గులు..

మంగళవారం, 6 జులై 2021 (10:57 IST)
బంగారం ధరలు రోజురోజుకు మారుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. 
 
ఇక నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం మంగళవారం కూడా స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 40 పెరిగింది. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు