మాల్యా కోసం జైలు గది.. టైల్స్ మార్చేశారు..

గురువారం, 30 ఆగస్టు 2018 (14:32 IST)
బ్యాంకులకు వేల కోట్ల మేర నగదు చెల్లించకుండా ఎగ్గొట్టి లండన్‌‌కు చక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని మాల్యా ఫిర్యాదు చేయడంతో లండన్‌ కోర్టు జైలు వీడియో పంపించాల్సిందిగా సీబీఐని అడిగింది.


దీంతో మాల్యాను ఉంచబోయే జైలుకు సంబంధించిన వీడియోను పంపించాల్సిందిగా లండన్‌ కోర్టు గతంలో భారత్‌ అధికారులను ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు ఆర్థర్‌ రోడ్‌ జైలులోని బారక్‌ నం.12ను వీడియో తీసి పంపించారు.
 
తొలుత ఆగస్టు 10వ తేదీన సీబీఐ అధికారులు జైలు గది వీడియోను తీశారు. దాని పట్ల అసంతృప్తిగా ఉండటంతో ఆగస్టు 13న మరోసారి వీడియో తీశారు. చివరి సారిగా ఆగస్టు 16న మూడోసారి వీడియో తీసి కోర్టుకు పంపించారు.
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా కోసం చక్కని జైలు గది సిద్ధమైంది. ఈ మేరకు మాల్యా కోసం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలు బారక్‌ నం.12ను సిద్ధం చేశారు. మాల్యా ఉండాల్సిన జైలు గదిలో టైల్స్‌ మార్చడంతో పాటు, గోడలకు పెయింటింగ్‌లు వేశారు. ఆయన కోసం బాత్‌రూంలో వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని మార్పులు చేసినట్లు పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్‌ ప్రమేష్‌ తెలిపారు. 
 
టాయిలెట్‌, ఫ్లోరింగ్‌ కూడా మార్చేశాం. ఇందుకోసం దాదాపు 45 మంది కార్మికులు పనిచేశారు. ఆర్థర్‌ రోడ్‌ జైలు‌లోని రెండు గదుల్లో మార్పులు చేశాం. ఒక దాంట్లో మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ ఉంటుండగా.. మరో దాన్ని మాల్యా కోసం సిద్ధం చేశామని పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు