"రిజర్వ్బ్యాంకుకు చెందిన ఇష్యూ ఆఫీసుల వద్ద ఈ నోట్లను ఉంచుతాం. అక్కడ ఆ నోట్లను పరిశీలిస్తాం. రీసైక్లింగ్కి పనికొచ్చేవాటిని.. పనికిరానివాటిని ‘కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) ద్వారా విభజిస్తాం" అని ఆర్బీఐ వెల్లడించింది. పనికిరాని నోట్లను వేగంగా, భద్రమైన, పర్యావరణహిత విధానంలో చలామణిలోంచి తప్పించే ఈ వ్యవస్థను 2003లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలన్ ప్రవేశపెట్టారు.
ఒక్కో సీవీపీఎస్కూ గంటలో 60 వేల నోట్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ వ్యవస్థ నోట్లను లెక్కిస్తుంది. అవి అసలైనవా లేక నకిలీవా గుర్తిస్తుంది. అసలైనవని తేలాక.. ఆ నోట్లు రీసైక్లింగ్కి పనికొస్తాయో రావో పరిశీలిస్తుంది. పనికిరాని వాటిని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. పనికొచ్చేవాటిని.. మళ్లీ నోట్ల తయారీకి అవసరమైన కాగితంగా మార్చేవిధంగా జాగ్రత్తగా కట్ చేస్తుంది.
కత్తిరించేసిన నోట్ల ముక్కలను బ్రికెట్స్ (పేపర్ ఇటుకలు అనుకోవచ్చు వీటిని)గా తయారుచేస్తారు. ఒక్కొక్కటీ 100 గ్రాములుగా ఉండే ఈ బ్రికెట్లను టెండర్లు పిలిచి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. పేపర్ వెయిట్లు, క్యాలెండర్లు, ఫైళ్ల వంటివాటిని తయారుచేస్తారు. సీవీపీఎస్ ఏర్పాటుకు ముందు.. పనికిరాని నోట్లను ముక్కలుగా చేసి కాల్చేసేవారు. దీనివల్ల విపరీతమైన కాలుష్యం వెలువడేది. ప్రస్తుత విధానం పర్యావరణ హితంగా ఉంది.