ఆగస్టు నుంచి తగ్గనున్న పెట్రోల్ - డీజిల్ ధరలు

శుక్రవారం, 23 జూన్ 2023 (17:51 IST)
దేశంలో పెట్రోల్ ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈ ధరలు ఇప్పటికే సెంచరీని దాటేశాయి. ఒక దశలో లీటరు పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో 140 రూపాయల వరకు చేరింది. దీంతో జనం గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలపై రోజువారీ సమీక్షను నిలిపివేశాయి. ఫలితంగా గత రెండు మూడు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో ఆగస్టు నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలు భావిస్తున్నాయి. లీటరుకు రూ.4 నుంచి రూ.5 మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, చమురు సంస్థలు ఉన్నట్టుండి ఈ తరహా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం లేకపోలేదు. ఈ యేడాది ఆఖరులో సెమీ ఫైనల్స్‌గా భావించే పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఆ తర్వాత వచ్చే యేడాది మార్చి - ఏప్రిల్ నెలల్లో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగనున్నాయి. దీంతో పెట్రోల్ ధరల పెరుగుదలపై జనాల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రంలోని బీజేపీ పాలకులు సూచన మేరకే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు