రైట్‌ టు హోమ్‌ 2021 ఎక్స్‌పో ఆన్‌లైన్‌ వెర్షన్‌ నిర్వహించబోతున్న ప్రాప్‌టైగర్‌

గురువారం, 4 మార్చి 2021 (18:12 IST)
ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ సంస్ధ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ తమ రైట్‌ టు హోమ్‌ 2021 ఎక్స్‌పో ఆన్‌లైన్‌ వెర్షన్‌ను 18-19 మార్చి 2021 తేదీలలో నిర్వహించబోతుంది. ఎలారా టెక్నాలజీస్‌ నిర్వహించబోతున్న ఈ ఆన్‌లైన్‌ ఎక్స్‌పోలో  అదానీ, గోద్రేజ్‌, షాపూర్జీ పల్లోంజీ, సిగ్నేచర్‌, వాధ్వా, టీవీఎస్‌, కల్పతరు వంటి 70 మందికి పైగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మొత్తంమ్మీద 19 వేల గృహ యూనిట్లను విభిన్నమైన ధరల విభాగం వద్ద ప్రదర్శించనున్నారు. ప్రధానంగా ఈ యూనిట్‌లు 45 లక్షల రూపాయల నుంచి 4.5 కోట్ల రూపాయల శ్రేణిలో ఉంటాయి.
 
‘‘ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన రైట్‌ టు హోమ్‌ ఎక్స్‌పో రెండవ ఎడిషన్‌ ఆఫ్‌లైన్‌ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయం అందించిన ప్రోత్సాహంతో తామిప్పుడు ఈ ఆన్‌లైన్‌ ఎడిషన్‌తో వచ్చామ’’ని ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌  సూద్‌ అన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా దాదాపు 2 మిలియన్ల మందిని తాము చేరుకోగలమని భావిస్తున్నట్లు ఆయన వెల్లడిస్తూ ఈ వర్ట్యువల్‌ కార్యక్రమం అందించే ప్రయోజనాలను స్వీకరించేందుకు సంభావ్య కొనుగోలుదారులు, మదుపరులను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎక్స్‌పో ద్వారా అత్యుత్తమ రాయితీలను సైతం కొనుగోలుదారులు పొందవచ్చు అని అన్నారు.
 
ఈ ఎక్స్‌పోలో భాగంగా ఎంపిక చేసిన రెరా ప్రాజెక్టుల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేకమైన చెల్లింపు ప్రణాళికలు, జీఎస్‌టీ, స్టాంప్‌ డ్యూటీ రద్దు, బుకింగ్స్‌పై బంగారు నాణెములను పొందడం వంటి అవకాశాలూ ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు