ఈపీఎఫ్ అకౌంట్ కలిగివున్నారా? ఇది బ్యాడ్ న్యూసే

గురువారం, 4 మార్చి 2021 (15:21 IST)
ఈపీఎఫ్ అకౌంట్ కలిగిన ఆరు కోట్ల మంది ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కు 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో కేవైసీ ఐడెంటిఫికేషన్ సమస్య కారణంగా వడ్డీ రేటుకు వేచి చూశారు. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించనున్నారనే వార్త ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్‌గా మారింది. 
 
కారణం ఏంటంటే.. పీఎఫ్ వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీరేటును నిర్ణయించేందుకు శ్రీనగర్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆప్ ట్రస్టీ (సీబీటీ)లు భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు ఇదే ఉంది.
 
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు మొత్తం రెండు వాయిదాల్లో వారివారి ఖాతాల్లో వేయబడుతుందని సీబీటీ గతంలో తెలిపింది. ఇందులో 8.15 శాతం ఇన్వెస్ట్‌మెంట్, 0.35 శాతం ఈక్విటీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాగా, 8.5 వడ్డీ రేటు గత ఏడేళ్లలో కనిష్టం. ఇదే వడ్డీ రేటు కొనసాగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు