ఖాతాదారులకు శుభవార్త చెప్పిన బ్యాంకులు... ఏంటది?

ఠాగూర్

బుధవారం, 9 జులై 2025 (22:43 IST)
దేశంలో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు ఇది శుభవార్త. సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ లేకుంటే విధించే చార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. 
 
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల జూలై 1, 2025 నుంచి తమ సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఈ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే బాటలో ఇండియన్ బ్యాంక్ కూడా జూలై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. 
 
కెనరా బ్యాంకు కూడా ఈ యేడాది మే నెలలో సాధారణం సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎన్.ఆర్.ఐ, శాలరీ ఖాతాలపై కూడా ఈ చార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు ఊరటనిస్తూ ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. 
 
దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా గతంలోనే ఈ చార్జీలను రద్దు చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఖాతాదారులకు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో బ్యాంకులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు