రైల్వే ప్రయాణికులకు శుభవార్త: అందుబాటులోకి రెగ్యులర్ రైళ్లు

శనివారం, 13 నవంబరు 2021 (11:48 IST)
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన రెగ్యులర్ సర్వీసులు త్వరలోనే మొదలు కానుంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మూడు నెలల పాటు దేశానికి తాళం పడిన సంగతి తెలిసిందే. 
 
దీని కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను నిలిపివేసింది రైల్వే శాఖ. రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. అయితే రెగ్యులర్ రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. టికెట్ ధరపై 30 శాతం అధిక ధరతో వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తూ వచ్చింది రైల్వే శాఖ. 
 
కరోనాకు ముందు దేశవ్యాప్తంగా నిత్యం 1700 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, ముప్పై ఐదు వందల ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కరోనా ఆంక్షల కారణంగా ఆ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. ప్రత్యేక రైళ్లలో 95శాతం మెయిల్ రైళ్లు అందుబాటులో ఉండగా 25శాతం రైలు ఇతర కేటగిరీలలో సేవలను అందిస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లను కేవలం వెయ్యి మాత్రమే నడుస్తున్నాయి.
 
70శాతం ప్యాసింజర్ రైలు ఎక్స్‌ప్రెస్ హోదా ఇచ్చి అదే స్థాయిలో టికెట్ ధరను కూడా వసూలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆదేశాలు రద్దు చేయడంతో పాటు రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. దీంతో ప్రయాణీకులకు ఊరట కలుగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు