రూ.2వేల తరహాలోనే 2026 నాటికి మొత్తం రూ.500 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చెలామణీలో లేకుండా పోతాయని పేర్కొంది.
12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కానీ ఇక, 500 నోట్ల ఉపసంహరణపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ స్పందించింది.
ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయని ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.
కాగా 2016 నోట్ల రద్దు తర్వాత ప్రస్తుత రూ. 500 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. ఈ నోటు పరిమాణం 66 మి.మీ x 150 మి.మీ.. ఈ నోట్ల రంగు బూడిద రంగులో ఉంటుంది.
'భారతీయ వారసత్వ ప్రదేశం - ఎర్రకోట' అనే థీమ్ దీని మీద ఉంటుంది. ఇతర భారతీయ రూపాయి నోట్ల మాదిరిగానే, రూ. 500 నోట్లపై కూడా వాటి మొత్తాన్ని 17 భాషలలో రాసి ఉంటుంది.
ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలు ఈ నోటుపై కనిపిస్తాయి.