ఎస్బీఐ ఖాతాదారులకు అలెర్ట్ : ఆ సర్వీసులకు తాత్కాలిక బ్రేక్

శనివారం, 10 జులై 2021 (11:57 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు వెల్లడించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా పలు సర్వీసులకు అంతరాయం కలుగనుందని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. 
 
ఆ ప్రకారంగా జూలై 10వ తేదీన 22.45 గంటల నుంచి జూలై 11న 00.15 గంటల వరకు ఎస్బీఐ ఆన్‏లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ఎస్‏బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవు. 
 
అలాగే ఎస్బీఐ తమ కస్టమర్లను మరో విషయంలో అలర్ట్ చేసింది. కస్టమర్లు ఆన్‏లైన్ అకౌంట్ల పాస్‏వర్డ్‏లను తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. అప్పుడే మోసాల బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని… ఈ విషయాన్ని కస్టమర్లు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించింది. 


 

Frequent change of password for your online accounts acts like a vaccine for viruses.
Stay safe against frauds & cyber crimes with an alert mind & appropriate precautions.

Know more: https://t.co/7wBxq78x9Q#SBIAapkeSaath #StayStrongIndia #LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/M25loXHPhB

— State Bank of India (@TheOfficialSBI) July 9, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు