బేగంపేట షోరూమ్‌లో చేతక్ 2901ని విడుదల చేసిన సిద్ది వినాయక బజాజ్

ఐవీఆర్

బుధవారం, 24 జులై 2024 (19:35 IST)
ఆటోమోటివ్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన సిద్ది వినాయక బజాజ్, రసూల్‌పురా మెట్రో స్టేషన్ సమీపంలోని బేగంపేట్ చేతక్ సీఈసీ షోరూమ్‌లో చేతక్ 2901ని విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారుతో పాటుగా చేతక్ డివిజన్ నుండి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కెవి బాబుల్ రెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీ కె మంజునాథ్- ఏరియా సేల్స్ మేనేజర్‌ శ్రీ ప్రవీణ్ పరదేశితో సహా ప్రముఖులు పాల్గొన్నారు.
 
ఎలక్ట్రిక్ మొబిలిటీలో చేతక్ 2901 ఒక ముందడుగుగా నిలుస్తుంది, పట్టణ ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి అత్యాధునిక సాంకేతికతతో బలమైన డిజైన్‌ను ఇది మిళితం చేస్తుంది. ధృడమైన మెటల్ బాడీ మరియు 123 కి.మీ (ARAI-సర్టిఫైడ్) పరిధిని కలిగి ఉన్న ఈ మోడల్ నేటి రైడర్‌ల విభిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. "మా వివేకవంతులైన కస్టమర్‌లకు చేతక్ 2901ని పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కెవి బాబుల్ రెడ్డి తెలిపారు. “ఈ ఆవిష్కరణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యుత్తమ నాణ్యత, ఆవిష్కరణలను అందించాలనే మా ప్రయత్నం, పట్టణ రవాణాలో అవకాశాలు, స్థిరత్వాన్ని పెంపొందించడంపై మా నిబద్ధతను నొక్కి చెబుతుంది"  అని అన్నారు. 
 
రంగులతో కూడిన డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, అనుకూలీకరించదగిన రైడ్ మోడ్‌ల వంటి అధునాతన కార్యాచరణలను పరిచయం చేసిన ఆప్షనల్ టెక్ ప్యాక్ అప్‌గ్రేడ్‌తో సహా చేతక్ 2901 ఫీచర్లను ఈ కార్యక్రమం ప్రదర్శించింది. చేతక్ 2901 ఇప్పుడు కాచిగూడ, కూకట్‌పల్లి-ఎల్బి నగర్‌, బేగంపేటలోని సిద్ది వినాయక బజాజ్ షోరూమ్‌లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. కస్టమర్‌లు ప్రత్యక్ష అనుభవం, టెస్ట్ రైడ్‌లు, బుకింగ్‌ల కోసం షోరూమ్‌ని సందర్శించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు