విదేశాలలో విద్యకి అవకాశం కోసం లీప్ ఔల్ వెంచర్స్ సిరీస్ సి రౌండ్‌ 55 మిలియన్ డాలర్ల సమీకరణ

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:55 IST)
హార్వర్డ్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఇంక్ మరియు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులైన జంగిల్ వెంచర్స్ మరియు సీక్వోయా క్యాపిటల్ ఇండియా కూడా పాల్గొనడం రౌండ్‌ గమనించింది. దక్షిణాసియాలోని అతిపెద్ద విదేశీ విద్యా సంస్థ లీప్, ఔల్ వెంచర్స్ నిర్వహణలో $ 55 మిలియన్ల (INR 400 కోట్లు) సిరీస్ సి ఫండ్స్ సేకరించింది.
 
మళ్ళీ మళ్ళీ పెట్టుబడులు పెడుతూ ఉండే జంగిల్ వెంచర్స్ మరియు సీక్వోయా క్యాపిటల్ ఇండియాతో పాటు హార్వర్డ్ మేనేజ్‌మెంట్ కంపెనీ పాల్గొనడం కూడా రౌండ్ గమనించింది. జంగిల్ వెంచర్స్ నిర్వహణలో లీప్ తన సిరీస్ బి ని పెంచిన 6 నెలల లోపలే రౌండ్, స్టార్టప్ ద్వారా ఇప్పటి వరకు పెంచబడిన మొత్తం ఈక్విటీ క్యాపిటల్ $ 75 మిలియన్లకు పైగా తీసుకువచ్చింది.
 
విద్యార్థులు అంతర్జాతీయ ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా లీప్ మౌళిక సదుపాయాలను కల్పిస్తోంది. దక్షిణ ఆసియాలో ఒక మిలియన్ సభ్యుల గొప్ప స్టడీ కమ్యూనిటీని నడుపుతూ గత 18 నెలల్లో 60,000 మంది విద్యార్ధులు విదేశాలలో చదువుకోవడానికి సహాయపడింది. లీప్ యొక్క ప్రోడక్ట్ అంతర్జాతీయ పరీక్షకి సిద్దం కావడం, ప్రొఫెషనల్ అడ్మిషన్ల కౌన్సెలింగ్, విద్యార్ధులకు రుణాలు, అంతర్జాతీయ విద్యార్ధుల  బ్యాంక్ ఖాతాలు, విదేశీ కరెన్సీ చెల్లింపు మరియు అంతర్జాతీయ కెరీర్ గైడెన్స్ అంటే మొదటి నుండి చివరి వరకు కావలసిన అవసరాలను నెరవేరుస్తుంది.
 
లీప్ సహ వ్యవస్థాపకుడు వైభవ్ సింగ్ ఇలా అన్నారు - “కోవిడ్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులు తెరుచుకున్నందు వలన ఈ సంవత్సరము విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల అపూర్వమైన డిమాండ్ మేము చూశాము. మా కమ్యూనిటీ నిర్వహణ విధానం అంతర్జాతీయ విద్యార్థుల అందరి అవసరాల కోసం ఒక సమగ్ర ప్రోడక్ట్ సూట్‌తో పాటు నిజంగా ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఆశ్చర్యకరం కాని గొప్ప అభివృద్దిని చూశాము. రాబోయే 12 నెలల్లో ఈ ప్రాంతం నుండి మిలియన్ ప్లస్ విద్యార్థులు విదేశాలకు వెళ్లాలని మేము ఆశిస్తున్నాము. ఆ డిమాండ్‌లో ఎక్కువ భాగాన్ని పూర్తిచేయడంలో ఈ పెంపు మనల్ని విజయవంతం చేస్తుంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ యాక్సెస్‌ను ప్రజాస్వామ్యం చేయాలనే మా ధ్యేయానికి కట్టుబడి ఉన్న మార్క్యూ గ్లోబల్ ఇన్వెస్టర్ల సపోర్ట్  మాకు ఆనందంగా ఉంది."
 
ఔల్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పటేల్ మాట్లాడుతూ, "విద్యార్థుల కోసం విదేశాలలో అత్యుత్తమ అధ్యయన వేదికగా అవతరించే దిశగా లీప్ దూసుకుపోతోంది. సింగిల్ వన్-స్టాప్ పరిష్కారం లేని చోట విదేశీ విద్యా అవకాశాలు సరిగ్గాలేవు. విద్యార్థులు ఎక్కడ ప్రిపరేషన్ ప్రారంభించాలి, ఏ కాలేజీలను టార్గెట్ చేయాలి ఇంక వారి చదువు కోసం వారు ఎలా చెల్లించాలి అనేవి స్పష్టంగా తెలియడం లేదు. లీప్ విద్యార్థుల కోసం ఈ విషయాలని మరియు ఫైనాన్సింగ్ అవసరాలన్నింటినీ తీర్చే ఒక సమగ్ర వేదికను ఏర్పాటుచేస్తోంది. వైభవ్, అర్ణవ్ మరియు లీప్ టీమ్‌తో మా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి ఔల్ వెంచర్స్ ఎంతో ఉత్సాహంగా ఉంది, వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు విదేశాలలో చదువుకోవడం అనేది నెరవేరుతుంది.”
 
మల్టీ డైమెన్షనల్ వృద్ధి కోసం లీప్ కొత్త క్యాపిటల్ ఇన్ఫ్యూషన్‌ను ఉపయోగించుకుంటుంది. SE ఆసియా మరియు మెన (MENA) ప్రాంతాల విద్యార్థులకు తన సర్వీస్ సూట్‌ను విస్తరించాలని మరియు 20 కంటే ఎక్కువ గమ్యస్థాన దేశాలలో వారికి విద్యా అవకాశాలను కొనసాగించడానికి కంపెనీ భావిస్తోంది.
 
అంతేకాకుండా, అంతర్జాతీయ విద్యార్థులకు మరింత వినూత్న పరిష్కారాలను అందించడానికి లీప్ తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని అనుకుంటోంది. చేయాలనుకుంటున్న కొన్ని ప్రొడక్టులలో అంతర్జాతీయ విద్యార్థి క్రెడిట్ కార్డ్ మరియు ఇన్షూరెన్స్ ప్రొడక్టులు ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌లో విజయం సాధించడంలో సహాయపడటానికి వీలుగా కంపెనీ ఒక సూట్‌ను కూడా తయారుచేస్తోంది.
 
కంపెనీ ప్రణాళికలపై వ్యాఖ్యానిస్తూ, సహ వ్యవస్థాపకులు అర్ణవ్ కుమార్ ఇలా అన్నారు -"ప్రపంచ విద్యార్థుల కదలికల కోసం మేము పట్టాలను నిర్మిస్తున్నాము. గత సంవత్సరంలో, మేము అంతర్జాతీయ విద్యార్థుల అభివృద్దికి ఒక ప్రోడక్ట్ సూట్‌ను రూపొందించాము. మేము భౌగోళికాలలో ప్రతిరూపంగా కొలమానమైన ఒక ప్లేబుక్‌ను కూడా ఉంచాము. ఇది ప్రోడక్టులలో మా వేగవంతమైన వృద్ధిని చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఆనందకరమైన  అనుభవాలను అందించడానికి మేము కొత్త ప్రోడక్ట్ లైన్స్ ఏర్పరచడం మరియు ఇప్పటికే ఉన్న వాటిని మరింత ఎక్కువగా అందించడం కొనసాగిస్తాము.”
 
జంగిల్ వెంచర్స్ వ్యవస్థాపక భాగస్వామి అమిత్ ఆనంద్ ఇలా అన్నారు, “విదేశాల స్టడీ సెక్టార్ లో పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు నమ్మకము మరియు స్థోమత ఎంతో కీలకమైనవి. విదేశాలలో విద్య మరియు దానికి సంబంధించిన ఫైనాన్సింగ్‌ను ఆశించే విద్యార్థులకు ఊహించదగిన, పారదర్శకమైన మరియు అత్యుత్తమ-ఉన్నతమైన అనుభవాన్ని కలిగించడానికి, ఎడ్-టెక్ మరియు ఫిన్‌టెక్ రంగాలలో పురోగతిని పెంచడంలో లీప్‌లోని బృందం గొప్పగా పని చేసింది. ఈ రౌండ్‌తో మా నిబద్ధతను గణనీయంగా పెంచడానికి మేము ఆనందిస్తున్నాము మరియు అంతర్జాతీయ విద్యార్థులకు అంతర్జాతీయంగా సేవలందించే అతిపెద్ద ప్లాట్‌ఫారమ్‌ని అందించడానికి అర్ణవ్ మరియు వైభవ్‌లకు సహాయం చేస్తూనే ఉంటాము.”
 
స్థాపించినప్పటి నుండి గత 18 నెలల్లో, లీప్ బృందం చురుకుగా పని చేస్తూ ఫైనాన్సింగ్, కౌన్సిలింగ్ మరియు టెస్ట్ ప్రిపరేషన్‌తో సహా విదేశాలలో చదువుకోవాలని ఆశిస్తున్న విద్యార్థుల వివిధ అవసరాలకి వారి సర్వీసులని విస్తృతంగా విస్తరించింది. భారతీయ విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలనే కోరిక మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఉంది మరియు లీప్, వారి సరైన సమగ్రమైన వ్యూహంతో, ఈ విద్యార్థులను అవకాశం కలిగించే ప్రముఖ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందని మేము నమ్ముతున్నాము,” అని సీక్వోయా క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ అన్నారు.
 
ఆగష్టు 2021 లో, కంపెనీ తన ప్రొడక్ట్స్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడానికి భారతదేశంలోను మరియు విదేశాలలోను సంవత్సరం చివరినాటికి 500 మంది ఉద్యోగులను నియమించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు