దేశంలో నిలకడగా పెట్రోల్ - డీజిల్ ధరలు

శుక్రవారం, 30 జులై 2021 (14:01 IST)
దేశ వ్యాప్తంగా సెంచరీ కొట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇపుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.84, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83. డీజిల్‌ రూ.97.45 ఉంది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96, విజయవాడలో రూ.107.93, డీజిల్‌ రూ.99.54గా ఉంది. మెట్రో నగరమైన చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39, బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26 చొప్పున ఉన్నాయి. 
 
నిజానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు