ఎస్బీఐ.. మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సోమవారం, 25 జనవరి 2021 (14:03 IST)
భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
 
పోస్టు పేరు: మేనేజర్‌ (రిటైల్‌ ప్రొడక్ట్స్‌)
అర్హత: ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా బీఈ లేదా బీటెక్‌ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
 
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్నవారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపికచేస్తారు. వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
 
అప్లికేషన్‌ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 12

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు