ఇంటర్ అర్హతతో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

గురువారం, 8 డిశెంబరు 2022 (11:47 IST)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇంటర్ అర్హతతో 4,500 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. సీహెచ్ఎస్ఎల్-2022 పేరుతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ), జానియర్ సెక్రటేరియట్ అసిస్సెంట్స్ (జూఆర్ ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీవీవో) వంటి పలు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 6వ తేదీ నుంచి వచ్చే యేడాది జనవరి నాలుగో తేదీ వరకు చేసుకోవచ్చు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకనేవారు విధిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి కూడా 18 నుంచి 27 యేళ్ళకు మించరాదు. పూర్తి వివరాల కోసం sss.nic.in అనే నోటిఫికేషన్‌లో చూడొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు