దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు: 24 గంటల్లో 1233

బుధవారం, 30 మార్చి 2022 (11:18 IST)
దేశంలో కోవిడ్ 19 కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 1,233 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,30,23,215కి పెరిగింది. మరోవైపు యాక్టివ్ కేసులు 14,704కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం బులిటెన్లో పేర్కొంది. 24 గంటల్లో కోవిడ్ వల్ల 31 మంది మరణించారు. ఈ సంఖ్యతో మరణాల సంఖ్య 5,21,101కి చేరుకుంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కేసులు 24 గంటల వ్యవధిలో 674 మేరకు నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతంగా నమోదైంది. వారంవారీ సానుకూలత రేటు 0.25 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు