దేశంలో కొత్తగా 37 వేల కరోనా పాజిటివ్ కేసులు

సోమవారం, 12 జులై 2021 (10:31 IST)
దేశంలో కొత్తగా 37154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 39,649 మంది కోలుకున్నారు. ఈ కేసులతో కలుపుకుంటే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376కు చేరింది.
 
ఇకపోతే మృతి చెందిన లెక్కలను పరిశీలిస్తే, గత 24 గంటల్లో 724 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,764కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,00,14,713 మంది కోలుకున్నారు. 4,50,899 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇంతవరకు 37,73,52,501 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 12,35,287 డోసులు వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు