కరోనాతో మృతి చెందిన మహిళ.. అదీ విమానంలో ప్రయాణిస్తూ..?

గురువారం, 22 అక్టోబరు 2020 (14:41 IST)
జూలై చివరలో లాస్‌వెగాస్‌ నుంచి డల్లాస్‌కు వెళుతున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. టెక్సాస్‌కు చెందిన ఆ మహిళ కరోనాతో మరణించిదని చెప్తున్నారు. లాస్‌వెగాస్‌ నుంచి డల్లాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు స్పిరిట్‌ ఫ్లయిట్‌ బయలుదేరింది.
 
అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. విమానంలో ఉన్న ఓ వ్యక్తి ఆమెకు సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది. ఆమె ఎంతకీ స్పందించకపోవడంతో విమానాన్ని ఆల్బుకెర్కీ దగ్గర ఆపేశారు. అప్పటికే ఆ మహిళ చనిపోయింది. టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల ఆ మహిళ విమానంలోనే చనిపోయిందని ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చెబుతున్నారు. 
 
కరోనా ఉన్నప్పుడు విమాన ప్రయాణం ఎలా చేశారు? అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? ఎయిర్‌లైన్స్‌ మాత్రం కరోనాకు సంబంధించి అన్ని ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతున్నామని, ఏ తప్పూ జరిగి ఉండదనే నమ్మకం తమకు ఉందని అంటోంది.. ఇప్పుడా మహిళతో కాంటాక్ట్‌ అయినవారిని ట్రేస్‌ చేసే పనిలో పడింది ఎయిర్‌లైన్స్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు