ఆనందయ్య తయారుచేస్తున్న కరోనా ఔషధం 159 యేళ్ళ క్రితమే లిఖించారు, ఇక్కడ చూడండి

మంగళవారం, 25 మే 2021 (10:50 IST)
కరోనాకు ఇంగ్లీషు మందులు ఎంత వాడుతున్నా పెద్దగా ఉపయోగం కనిపించడం లేదు. చాలామంది కరోనా బారినపడి చనిపోతున్నారు. అయితే కరోనాను చంపేందుకు ఆయుర్వేదం బాగా పనిచేస్తుందని నిరూపించారు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య. ఆయన ఇచ్చే ఔషధం వ్యక్తులపై బాగా పనిచేస్తోంది. 
 
దీంతో ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కరోజులోనే అది కాస్త ఆగిపోయింది. కానీ ఆనందయ్య వాడుతున్న 18 రకాల మూలికలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? అసలు కరోనాకు ఔషధాన్ని ఆనందయ్య ఎలా కనిపెట్టగలిగాడన్నదే ఇప్పుడు అందరిలోను మెదులుతున్న ప్రశ్న. 
 
అయితే ఆశ్చర్యమేమింటే ప్రస్తుతం ఆనందయ్య ఉపయోగిస్తున్న మూలికలు, వాటి వివరాలు 159 యేళ్ళ చరిత్ర కలిగిన పుస్తకాల్లో లిఖించబడి వున్నాయట. ఇది కాస్త ఈ మధ్యనే బయటపడింది. జిల్లేడు పువ్వు మొగ్గలు, మిరియాలు, పచ్చ కర్పూరం, మరువము ఇలా మొత్తం 18 రకాల మూలికల వివరాలు అందులో స్పష్టంగా ఉన్నాయట.
 
అసలు ఇది ఎలా పనిచేస్తుందన్న విషయం కూడా అందులో ఉంది. కరోనా వస్తుందని మందుగానే ఊహించి ఈ పుస్తకంలో రాశారేమోనని భావిస్తున్నారు. ఆ పుస్తకంలో ఉన్నట్లుగానే ఆనందయ్య మొత్తం మూలికలను ఉపయోగించి ఈ ఔషధాన్ని తయారుచేస్తున్నారట. అయితే ఈ ఔషధంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు